త్రినేత్రం న్యూస్. రాజనగరం ఆగస్టు 27, అందరికి ఎంతగానో ప్రీతికరమైన పండుగ వినాయక చవితి. అలాంటి ఈ పండుగ ను రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఇంట అత్యంత వైభవంగా జరిగింది. బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి,తో కలిసి వారి స్వగృహమునందు పూజారుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహాగణపతిని చక్కని రీతిలో అలంకరణ చేసి, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో పాటుగా రాజానగరం నియోజకవర్గం లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా ఆ విఘ్నేశ్వరుడు అన్నింట్లోనూ విజయాల్ని ప్రసాదించి అందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


