MLA Vegulla : వినాయక మండపాలకు ఉచిత విధ్యుత్

TRINETHRAM NEWS

మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ
త్రినేత్రం న్యూస్. మండపేట ఆగస్ట్ 27, వినాయకచవితి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకొనేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేట లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌ॥మానవ వనరుల అభివృద్ది, ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు, కమ్యూనికేషన్ మరియు ఆర్.టి.జి శాఖా మాత్యులు నారా లోకేష్, చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు వేగుళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free electricity for Vinayaka Mandapalas

You cannot copy content of this page

Scroll to Top