Kuna Srisailam Goud : సారెగూడెం బంగారు మైసమ్మ 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని డి.పోచంపల్లి మున్సిపాలిటీ, సారెగూడెంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవస్థానం 6వ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం వేదపండితుల ఆశీర్వచనల మధ్య ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించారు..

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాసరెడ్డి, డి.పోచంపల్లి మాజీ కౌన్సిలర్ యం.రాము గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు నాగరాజు, సదానందం, యాదగిరి, మచ్చంధర్ రావు, కొల్తూరు మల్లేష్, శంకర్, రాజు, కె శ్రీశైలం, లక్ష్మీనారాయణ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Kuna Srisailam

You cannot copy content of this page

Scroll to Top