ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

TRINETHRAM NEWS

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక …..

ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో వైఏస్సార్సీపీ పార్టీ లోకి చేరారు. యువ నాయకులు శ్రీ కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top