తేదీ : 02/10/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); వజ్రకరూర్ మండలంలో ఉన్నటువంటి సుంకాలమ్మ ఆలయానికి ఉరవకొండకు చెందిన సుంకన్న కుటుంబం బైకుపై వెళ్తుండగా బొలెరా వాహనం ఢీ కొట్టింది. పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి , కొడుకు సన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. కూతుర్లు భవాని, కల్పన తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను అక్కడ స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


