WhatsApp Image 2024 01 18 at 5.34.50 PM
అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి
నార్పల మండలం నర్సాపురం గ్రామ సమీపంలో ఉన్న హెచ్ఎల్సి కెనాల్ వద్ద గురువారం విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతిచెందారు. హెచ్ఎల్సీ కాలువలో మోటార్కు పాచి తీస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి భయపరెడ్డి ఆయన కుమారుడు రాజారెడ్డి ఇద్దరు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
