ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్

TRINETHRAM NEWS

ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి లో గల శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ సందర్బంగా ఆయన ప్రతి మనిషి దైనందిత జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో సన్మార్గంలో నడవడంతో పాటు సవాళ్ళని ఎదుర్కుని, ఒత్తిడిని అదిగమించడానికి మరియు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మనకు ఆధ్యాత్మిక చింతన ఎంతగానో అవసరమని తెలిపారు. ఆ విష్ణుమూర్తి దయతో వికారాబాద్ నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, నూలి కిరణ్ పటేల్, సీనియర్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ పాండు, నాయకులు గంగారం వెంకట్, R. మల్లేశం, గాండ్ల మల్లికార్జున్, బాబు నాయక్, అనంతయ్య, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, నాయకులు మదన్పల్లి అశోక్, పులుసు మామిడి మహిపాల్ రెడ్డి, నారాయణపూర్ శ్రీనివాస్ గౌడ్, హన్మంత్ రెడ్డి, మహిపాల్ నాయక్, దారూర్ మండల యువజన విభాగం అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, ఎన్కే పల్లి ప్రవీణ్ కుమార్, మర్పల్లి జైపాల్, శివరాం నగర్ కిషోర్, సోను రాథోడ్, సిద్ధూ్లూర్ శ్రీనివాస్, S. రాజు నాయక్, వెంకటాపూర్ తండా శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top