TRINETHRAM NEWS

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

గత 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదు అయినా నియోజకార్గాలను గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ను సిద్దం చేస్తోంది ఎలక్షన్ కమీషన్.