జూన్ 27, 2026

IMG 20241227 WA0030

TRINETHRAM NEWS

మాదకదవ్యాలపై అంగన్వాడీలకు అవగాహన సదస్సు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ భవన సముదాయంలోని జిల్లా మహిళా సమైక్య మీటింగ్ హాల్ నందు రాష్ట్రస్థాయి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒకరోజు మారకద్రవ్యాల ,మద్యపానం దుర్వినియోగం మరియు నివారణ అనే అంశంపై శిక్షణ అంగన్వాడి టీచర్లకుకార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ సి ఎ కోఆర్డినేటర్ శ్రీపాద సుధాకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం యువతలో ఎక్కువైందని ఈ మహమ్మారిని తగ్గించడానికి మాస్టర్ వాలంటరీలునశాముక్త భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా పనిచేయాలని, మత్తు బానిసలుగా మారిన వ్యక్తులను డి అడిక్షన్ లలో చేర్పించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కొడంగల్ సిడిపిఓ రజిత ,ఐసిడిఎస్ సూపర్వైజర్స్, దశమ్మవికారాబాద్ సూపర్వైజర్ శాంత జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్ నుండి ఎం వెంకటేష్ ఎఫ్ ఆర్ వో నశాముక్త భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ పులిందర్, మధు వికారాబాద్ జిల్లాలోని ప్రతి మండలం నుంచి ముగ్గురు అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page