విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు

TRINETHRAM NEWS

విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు…

ఖమ్మం జిల్లా వైరా మండలం లింగన్నపాలెం గ్రామంలో వరి కోత యంత్రానికి విద్యుత్ కేబుల్ వైరు తగిలి వరి కోత యంత్రం డ్రైవర్ కు గాయాలయ్యాయి లింగన్నపాలెం గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటను కోత కోసేందుకు వెళ్తుండగా గ్రామ సమీపంలో వరి కోత యంత్రానికి విద్యుత్ వైరు తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ధర్మదూరి కార్తికేయ అనే డ్రైవర్ కు గాయాలయి అపస్మారపు స్థితిలో పడిపోవడంతో లింగన్నపాలెం గ్రామానికి చెందిన చంగల పరశురాము వెంటనే కారులో వైరా లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యసికిత్సలు అందించారు దీంతో స్థానికులు తృటిలో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు

You cannot copy content of this page

Scroll to Top