వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి పట్టణంలోని 8వ వార్డు మున్నూరు వాడకి చెందిన సమీనా బేగం w/o మైనుద్దీన్ ఇల్లు అకాల వర్షంతో కూలిపోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సమీనా బేగం నివాసాన్ని పరిశీలించి వారికి మహిళా సంఘం ద్వారా 1లక్ష రూపాయలు మంజూరు చేయించి,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా పుట్నాల బిబి నివాసాన్ని పరిశీలించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సమీనా బేగం పుట్నాల బిబి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే TRR కు కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


