త్రినేత్రం న్యూస్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు, సెన్సెక్స్ 809 పాయింట్లు దిగజారి 76,045 వద్దకు చేరాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 99.51, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100.92 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈర్డ్లు 4.23 శాతానికి చేరాయి. గత సెషన్లో యూఎస్ ఎస్&పీ 0.08 శాతం పడిపోగా, నాస్డాక్ 0.08 శాతం పెరిగింది.


