జూన్ 26, 2026

IMG 20241113 WA0035

TRINETHRAM NEWS

విద్యార్థులు క్రీడలతో పాటు విద్య లో ను ముందుండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
బుధవారం వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట (అనంతగిరిపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల ఆవరణలో 10 వ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో మాట్లాడారు . వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్రీడాకారులతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో ముందుండాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వం తో పాటుమానసికంగాబలపడతారని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపొంది జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని , విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలాన్నారు. క్రీడల్లో తమనైపుణ్యాన్నిపెంపొందించుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో రాణించినట్లయితే ఉద్యోగల్లో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ఉమాశంకర్ ప్రసాద్ ,సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాంఘికసంక్షేమగురుకుల బాలల పాఠశాల ల విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page