డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి

TRINETHRAM NEWS

డిజిపి కార్యాలయం
మంగళగిరి

రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి

అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన అవినీతి నిరోధక శాఖ, సిఐడి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటలిజెన్స్, ఏ‌పి‌ఎస్‌పి బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్‌ఈ‌బి) విభాగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలను సేకరించడం జరుగుతుంది.

త్వరలోనే వారికి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి డిస్క్ అవార్డులను అందించడం జరుగుతుంది.

క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందించడం జరుగుతుంది.

వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ మెడల్స్ అందించడం ద్వారా మరింత ఉత్సాహంతో వారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతగానో దోహద పడుతుంది.

డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి

You cannot copy content of this page

Scroll to Top