ప‌ట్టాలు త‌ప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్

TRINETHRAM NEWS

Trinethram News : రాజస్థాన్ :మార్చి 18
ఈ మ‌ధ్య కాలంలో రైళ్లు త‌రుచూ ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. అధి కారులోప‌మో లేదా సాంకే తిక లోప‌మో గానీ ప్ర‌మాదా లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమ‌వారం తెల్ల‌వారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

అదృష్టవశాత్తూ ఈ ఘట నలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని సబర్మతి నుంచి యూపీలోని ఆగ్రాకు వెళ్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్ సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది.

మాదర్ రైల్వే స్టేషన్‌ సమీ పంలో తెల్ల‌వారుజా మునా రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహా యక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తు న్నారు.

రాత్రి తామంతా గాఢ నిద్ర లో ఉండా పెద్ద శబ్దం వినిపిం చిందని, చివరకు రైలు పట్టా లను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడి యాకు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top