తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌

TRINETHRAM NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ ..!!

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ అలాగే పీజీ కాలేజీల బంద్ నకు డిగ్రీ కాలేజీల అసోసియేషన్…పిలుపు ఇవ్వడం జరిగింది.

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం ఇవాల్టి నుంచి… శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న అన్ని కాలేజీలు బంద్ కాబోతున్నాయి. బకాయిలు రిలీజ్ చేసే వరకు కాలేజీలు అసలు తెరిచేది లేదని అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. గతంలో కూడా.. అంటే అక్టోబర్ నెలలో నాలుగు రోజులపాటు కాలేజీలు మూసివేసి మరి… నిరసన తెలిపారు. ఆ సమయంలో నాలుగు రోజుల్లో డబ్బులు పడతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఇంకా పడలేదు. దీంతో ఈసారి ఉధృతంగా తమ ఉద్యమాన్ని చేస్తున్నారు డిగ్రీ కాలేజీ అసోసియేషన్ సభ్యులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top