WhatsApp Image 2024 03 11 at 20.46.37
Trinethram News : విజయవాడ :
రాష్ట్ర సమాచార కమీషన్ కు నియమించ బడిన ముగ్గురు నూతన కమీషనర్లు రెహానా బేగం, చావలి సునీల్, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ మేరకు సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమిషనర్ మెహబూబ్ భాషా,ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా,శామ్యూల్ జొనాతన్,కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జి.శ్రీనివాసులు,ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
