డివిజన్ లో కొత్త కరెంటు స్తంభాల ఏర్పాటుచేసిన కార్పొరేటర్ కొమ్ము వేణు

TRINETHRAM NEWS

డివిజన్ లో కొత్త కరెంటు స్తంభాల ఏర్పాటుచేసిన కార్పొరేటర్ కొమ్ము వేణు…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ లో గత కొన్ని సంవత్సరాల క్రితం వేసినటువంటి పాత స్తంభాలు శిధిలావస్థకు రావడంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పాతవి తీసేసి వాడి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని అందులో భాగంగానే ఈరోజు పాత స్తంభాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది డివిజన్లో కరెంటు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలో భాగంగానే వాటిని పురందరించాలని విద్యుత్ అధికారులను కోరిన వెంటనే స్పందించి వారి సిబ్బంది పంపించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి. మైనార్టీ జనరల్ సెక్రెటరీ ముస్తఫా ఉమర్ అలీ. ఫెరోస్. తాళ్లపల్లి శ్రావణ్. అప్సర అలీ. గోశిక వెంకటస్వామి. డివిజన్ కు సంబంధించిన పెద్ద మనుషులు పాల్గొన్నారు సహకరించినటువంటి విద్యుత్ అధికారులకు వారి సిబ్బందికి డివిజన్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top