TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ…

విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్ షర్మిల

షర్మిళ కామెంట్స్….

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి

పాలక పక్షం-ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయి

టీడీపీ హయాంలో స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టారు

వైసీపీ బీజేపీతో తెరవెనుక పొత్తు పెట్టుకున్నారు

స్పెషల్ స్టేటస్ కోసం జగన్ దీక్షలు చేశారు

మొత్తం ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ అనలేదా

మాట మాత్రమైనా జగన్ కేంద్రాన్ని ఆడిగలేదు

స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జగన్ పోరాటం లేదు

గంగవరం పోర్టుని ఆధానికి జగన్ అప్పనంగా అప్పచెప్పారు

రాష్ట్రంలో విలువైన సంస్థలను తాకట్టు పెట్టారు

స్టీల్ ప్లాంట్ లో 30 వేల మందికి భరోసా పోయింది

కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వలేదు

కేంద్రాన్ని నిలదీయడంలో వైసీపి, టీడీపీ విఫలమయ్యాయి

10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు

మతతత్వ పార్టీ అయిన బీజేపీని తుంగలోకి తొక్కాలి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంది

ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

నేను రెడీ, మీరు రడియా అన్న షర్మిల