WhatsApp Image 2024 02 04 at 12.22.27 PM
Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 04
తాజాగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సత్కరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు.
తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ అవార్డులు వరించాయి . మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది.
చిందు యక్షగాన కళాకా రుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వ రికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
