విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

TRINETHRAM NEWS

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు.

కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారు.

భారాస ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.

విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందన్నారు. 

You cannot copy content of this page

Scroll to Top