త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య నియోజకవర్గం పరిధిలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత 1000 కోట్లకు పైగా నిధులు సీఎంఆర్ఎఫ్ కొరకు వేచి ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ ది కాలే యాదయ్య పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం లింగారెడ్డి గూడ గ్రామానికి చెందిన మంగలి బాలరాజ్ కి చెందిన 60000 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన లబ్ధిదారునికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురైన ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్ద పీఠం వేస్తూ 1000 కోట్లకు పైగా నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీకి చెందిన స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


