TRINETHRAM NEWS

ఆడపడుచులకు అన్నగా పాలనను కొనసాగించిన నేత సీఎం కేసిఆర్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ గారి మానసపుత్రిక కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంజూరైన 202 కళ్యాణలక్ష్మీ చెక్కులలో 50 చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వము పాలనను చేపట్టిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన చెక్కుల పంపిణీ కార్యక్రమం నేడు పూర్తిచేశామన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.