రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని… తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రయోజనల కోసం రాజీనామాలు కూడా చేయడం అందరూ చూశారన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడం చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని చెప్పారు. రైల్వే జోన్‌కు సంబంధించి సైటు కూడా ఇవ్వడం జరిగిందని దాని కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు..

2024 విభజన తర్వాత సుమారు పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను పెట్టారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా తాత్కాలిక రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విశాఖ రాజధాని అని అనుకున్నామని చెప్పారు. దానిపై కూడా న్యాయ పరమైన ఇబ్బందులు పెట్టారని వాటిని కూడా ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాటిని అన్నిటినీ అధిగమించిన అంతవరకు కూడా హైదరాబాద్‌ను కొనసాగించాలని తమ ఆలోచన అని వివరించారు.. ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ రాజధానిగా ఉండటంపై వివరణ ఇస్తారని చెప్పారు. విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు కూడా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని తమ ఆలోచన అని చెప్పారు. ఈ నెల ఆఖరున వైసీపీ మేనిఫెస్టో వచ్చే అవకాశం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top