చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

TRINETHRAM NEWS

Trinethram News : బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పటైయ్యింది. తేదీ 6. 4.2024 రోజున ఉదయం స్థానిక కమ్యూనిటీ హాలు నందు జరిగిన ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ గారు ముఖ్య అతిథి గా పాల్గొని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘంనూతన అధ్యక్షునిగా సైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అక్కెన నపల్లి లక్ష్మణాచారి,ప్రధాన కార్యదర్శిగా సింగిరెడ్డి బుచ్చిరెడ్డి, కోశాధికారిగా సామల అంజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గుండా ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ గా కె. కుమారస్వామి, మహిళా కార్యదర్శులుగా వి.లలిత , బీ.కళావతి,ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా ఎం. రంగారావు, వై. వేంకటేశ్వర రెడ్డి,ఎంపికయ్యారు.ఈ సంఘానికి టి.,
గిడ్డయ్య, ఏ. శ్రీనివాస్ లు సలహాదారులుగా వ్యవహరిస్తారు. కార్యక్రమంలో కో అప్షన్ సభ్యులు బ్రహ్మన్న ,ప్రకాష్, మాజీ కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డి, గణేష్ నాయక్ లతో పాటు పలువురు స్థానిక నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top