తేదీ : 24/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు నియోజవర్గం ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురునాన కాలనీలోని ఎన్టీఆర్ భవనంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. భవనం ఆవరణంలో ఎంపీ ఇరవై కేజీల కేక్ ను కట్ చేసి నాయకులకు, కార్యకర్తలతో తన ఆనందం పంచుకున్నారు.
ఆయనకు ఎంపీ అయ్యేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. అదేవిధంగా తమ విజయానికి కారణమైన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిరీ కమిటీచైర్మన్ గొట్టుముక్కల. రఘురామరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా. సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సాయి చరణ్ యాదవ్ , మాజీ మేయర్ కోనేరు. శ్రీధర్, టి. ప్రేమనాద్ , కార్పొరేటర్లు చెన్నుపాటి. ఉషారాణి, దేవినేని.
అపర్ణ, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు జీవి. నరసింహారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల. సీతారామయ్య, రాష్ట్ర నాయకులు గన్నే. ప్రసాద్, చెన్నుపాటి. గాంధీ, మాజీ ప్లోర్ లీడర్ ఎరుబోతు. రమణ, టిడిపి సీనియర్ నాయకులు నరసింహ చౌదరి, వై. వేదవ్యాస్, మాది గాని. గురునాథం, పీతా.బుజ్జి, పట్నాల .హరిబాబు, కోడూరు ఆంజనేయవాసులతో పాటు పాటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


