WhatsApp Image 2024 12 27 at 19.39.44
టీబీ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత
సీనియర్ చికిత్స పర్యవేక్షకులు దేవ తిరుపతి
క్షయ రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కేంద్ర
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దేశంలో 324 జిల్లాల్లో నిర్వహిస్తుందని అందులో పెద్దపెల్లి జిల్లా ఉందని దానిని పెద్దపల్లి జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా టిబి సీనియర్ చికిత్స పర్యవేక్షకులు దేవ తిరుపతి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాఘవపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కొత్తపల్లి లో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వం నిక్షయ్ శిబిర్100 రోజుల పథకంలో భాగంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆదేశాల మేరకు జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కె,వి.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లో క్షయ శిబిరాన్ని నిర్వహించారు.దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులలో స్క్రీనింగ్ పరీక్షలు, లక్షణాలున్నటువంటి వారి నుండి కఫాన్ని సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి.పి.పి.ఎం కె.ప్రభాకర్,ఎం,ఎల్,హెచ్, పి, హర్ష ,హెచ్.ఈ.ఓ సాంబయ్య,తిరుపతమ్మ
ఏ,ఎన్,ఎం. సరోజ, ఆశాలు సరోజ,స్వప్న మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
