Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్

TRINETHRAM NEWS

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా….రాజమహేంద్రవరం…. వైఎస్ఆర్సిపి ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ ఏడు జిల్లాల వైఎస్ఆర్సిపి సమన్యయ కార్యకర్తలతో ప్రెస్ మీట్…… మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ప్రజాస్వామ్యం అన్న మాటే లేదు.. అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది

ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమవుతుంది ఇప్పుడు రైతు భరోసాలు ఇస్తున్నారు ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఏం చేసింది .. రైతులను మోసం చేస్తున్నారు ఏడు లక్షల మందికి ఇంకా అన్నదాత సుఖీభవ అందలేదు.. లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు.. ముఖ్యమంత్రి అటహాసంగా విడువ పెన్షన్ లక్ష మందికి ఇచ్చారు ఆ లక్ష మంది ఎవరు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు.. గత ప్రభుత్వంలో రోడ్లు అన్ని పాడైపోయాయి అన్నారు మా ప్రభుత్వంలో రోడ్లన్నీ వేస్తానన్నారు ఎక్కడ వేశారు 20 పర్సెంట్ రోడ్డు కూడా వేయలేదు..

ఈ ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదు కమిట్మెంట్ లేదు.. మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాపులు, మర్డర్ ఈ ప్రభుత్వంలో ఎక్కువైపోయారు.. లా అండ్ ఆర్డర్ గతి తప్పయి..

ఈ 14 నెలలో ఈ ప్రభుత్వం ఏం సాధించింది మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ చూసినా నాణ్యత లేదు.. భూకబ్జాలు ఎక్కువైపోయాయి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, వైజాగ్ లో భూకబ్జాలు చేసేది ఎమ్మెల్యేలు ఎంపీలు మనుషులు.. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడానికి మొన్న టెండర్లు పిలిచారు ఇది ఎక్కడ అన్యాయం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని ఆనాడు అన్న మాటలు ఈరోజు ఏమైపోయారు.. సిగ్గుండాలి 11 మంది పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని కలిసి ప్రైవేట్ ఫ్యాక్టరీల రాయితీ కోసం మాట్లాడటం కరెక్ట్ కాదు

మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ మీ ఇంటికొస్తే ఏం ఇస్తాం అన్నట్టు ప్రభుత్వం పనితీరు పనిచేస్తుంది.. రైతులకు యూరియా బస్తా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది రైతుల కోసం ఆలోచించే సమయం మీ ప్రభుత్వానికి లేదు.. ఎక్కడ చూసినా మంత్రుల మీద ఎంపీల మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి అది ఆరోపణ కాదు వాస్తవాలు.. పిల్లలకు భోజనం పథకం పెట్టింది జగన్, స్కూల్ కట్టించింది జగన్, కరెంటు ఫ్యాన్లు వేయించింది జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం ఏం చేసింది.. గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో జరిగిన పొరపాట్లు ఈ ప్రభుత్వంలో 14 నెలల జరిగాయి మిగిలిన కాలంలో ఇంకేం జరుగుతాయో చూడండి.. గత ప్రభుత్వంలో గంజాయి ఎక్కడో కొన్ని చోట్ల రవాణా జరిగేది ఈ ప్రభుత్వంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి రవాణా జరుగుతుంది ఇది ఈ ప్రభుత్వం పనితీరు.. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఇవ్వడం లేదు వాళ్ల సొంత ప్రయోజనం కోసం వాడుతున్నారు

ఈనెల 25వ తారీఖున సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని కలవడానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది.. వైజాగ్లో ప్రధాన మోడీ చేసిన యోగాడే కార్యక్రమం వల్ల ఎవరికి లాభం, దానికైనా ఖర్చు ఎవరికి బొక్క.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండండి అని బొత్స సత్యనారాయణ అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Botsa Satyanarayana press meet

You cannot copy content of this page

Scroll to Top