జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం సందర్భంగా ఈరోజు పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి, అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో బాలసాని శ్రీనివాస్ గౌడ్,పులి రవి గౌడ్,బాలసాని రాజయ్య గౌడ్,జక్కుల రాజు గౌడ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కొయ్యడ రాజయ్య గౌడ్,సిరాలపు రమేష్, దాసరి దేవయ్య, హరికృష్ణ, కొయ్యడ పురుషోత్తం గౌడ్,కారే విజ్జాలు, శేషగిరి రవి మరియు అధిక సంఖ్యలో భక్త్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP's Egolapu Sadayya Goud

You cannot copy content of this page