వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు
త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు. మనవరాలు బిర్రం హేమశ్రీ.జన్మదిన వేడుకలను అశ్వారావుపేట పట్టణంలోని అమ్మ సేవా సదనం లో ఘనంగా జరిపినారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి వృద్ధాశ్రమంలో ఉన్న 28 మంది వృద్ధులకు పండ్లు. వస్త్రాలు పంచి పెట్టినారు. ఈ కార్యక్రమంలో, అమ్మ సేవాసదనం నిర్వాహకురాలు అనసూయ మాట్లాడుతూ, అమ్మ సేవాసదనంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు,సేవాసదనం తరపున కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇలాగే జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని దీవించినారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


