ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా..

ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం..

ఆగిఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టిన బుల్లెట్.. ఓ యువతి అక్కడిక్కడే మృతి.

సంక్రాంతి పండుగ సెలవులు సందర్భంగా ఇద్దరు యువతీయువకులు హైదరాబాద్ నుంచి కోనసీమ జిల్లా రామచంద్రపురం కు బుల్లెట్ పై వెళ్తున్నారు.

తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ సమీపంలో అగిఉన్న భారీ కంటైనర్ అంచున బుల్లెట్ ఢీకొంది.

దీంతో బుల్లెట్ పై ప్రయాణం చేస్తున్న బొప్పన చాందిని (25) అనే యువతి అక్కడిక్కడే మృతి చెందగా,యువకుడు గాయపడ్డాడు.

సమాచారం అందుకుని ప్రమాద స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు. వివరాలు సేకరిస్తున్నారు.

హైవే పెట్రోలింగ్ సిబ్బంది జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top