WhatsApp Image 2024 01 17 at 6.51.10 PM
Trinethram News : జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు ఉదయం 9:00 గంటలకు బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో “జయహో బిసి” కార్యక్రమం జరుగును.
రేపు మధ్యాహ్నం 3:00గంటలకు కర్లపాలెం మండలం, పిట్టలవానిపాలెం మండల ఆధ్వర్యంలో “జయహో బిసి” కార్యక్రమం కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి సమక్షంలో కార్యక్రమం నిర్వహించబడును.
కావున బాపట్ల మండలం, కర్లపాలెం మండలం, పిట్టలవానిపాలెం మండలం బీసీ నాయకులు, కార్యకర్తలు, తప్పని సరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
బాపట్ల తెలుగుదేశం పార్టీ, కార్యాలయం.
