Bandi Ramesh : రంజాన్ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మొదటగా వై .సలీం యూత్ కాంగ్రెస్ మూసాపేట్, ఎండి బషీర్ హబీబ్ నగర్, సయ్యద్ చున్ను పాష మూసాపేట్, మోయునుద్దిన్ డివిజన్ ప్రెసిడెంట్ అల్లాపూర్, ఎండి షఫీ సఫ్ధర్ నగర్, ఎండి వాజిద్ పాషా రామారావు నగర్ మూసాపేట్ డివిజన్ పైన పేర్కొన్న వారి ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు.మరియు వారిచ్చిన ఆదిత్యం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, లక్ష్మయ్య, ప్రతాప్ రెడ్డి, సతీష్ గౌడ్, కృష్ణ రాజ్పుత్, యుగేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh participated in

You cannot copy content of this page

Scroll to Top