జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 11 at 18.40.49

TRINETHRAM NEWS

Awareness of new laws is required

బార్ అసోసియేషన్ గోదావరిఖని.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అదనపు జిల్లా న్యాయ మూర్తి.డాక్టర్.టీ.శ్రీనివాసరావు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన చట్టాల పై ప్రతి ఒక్క న్యాయ వాది అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి.డాక్టర్.టీ.శ్రీనివాసరావు.అన్నారు.ఈ మేరకు హై కోర్ట్ న్యాయమూర్తి రాపోలు భాస్కర్ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం న్యాయ వాదులకు నూతన చట్టాలపై రూపొందించిన పుస్తకాల పంపిణీ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేర్చుకున్న విద్యను ప్రతి ఒక్కరికీ పంచాలన్నారు.

అనంతరం న్యాయవాదులకు ఉచితం గా అందజేసారు.బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ అద్యక్షతన. జరిగిన ఈ కార్య క్రమం లో సబ్ జడ్జి భృంగి శ్రీనివాసులు,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.మంజుల ,2 వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్ ,కమిటీ సభ్యులు గోసికా ప్రకాష్ ,పులిపాక ప్రవీణ్ కుమార్,దూడపాక లింగస్వామి,ఇరుగురాల మహేందర్ .ఇరుగురాల సంతోష్,దామ సంతోష్,గడమళ్ల వరలక్ష్మి.రమ్య తో పాటు జూనియర్ .సీనియర్ న్యాయ వాదులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness of new laws is required

You cannot copy content of this page