జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 24 at 5.57.51 PM

TRINETHRAM NEWS

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ఆటో యూనియన్ నాయకులు.

ఏఐటీయూసీ అనుబంధ క్రాంతి ఆటో యూనియన్ ఐడీపీఎల్ నుండి గండిమైసమ్మ చౌరస్తా కు నడిపే ఆటో డ్రైవర్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శి రాజకుమార్,ఎల్లస్వామి ఆధ్వర్యంలో సిఐ ని కలసి శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి హరినాథ్,శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగిఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పైలటింగ్ ఉండకూడదని దాన్ని వల్ల అమాయకులు ఈ రెండు రోజుల్లో ఇద్దరు మరణించారని కావున నిబంధనలు పాటించాలని సూచించారు.
అలాగే ప్రయాణికులతో మంచిగా మెలగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాము, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ ,సీనియర్ నాయకులు కేశవులు,ఆటో యూనియన్ నాయకులు జహంగీర్, కుమార్,గోపి,శ్రీనివాస్,పూర్ణ చందర్,బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page