జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 04 at 21.20.21

TRINETHRAM NEWS

మారు పేర్ల బాధితుల సంఘం పాదయాత్ర.

గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కార్మికుల డిపెండెన్స్ మారు పేర్లు విజిలెన్స్ విచారణ పేరుతో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు గోలేట్ నుండి పాదయాత్ర ప్రారంభించారు.
ఆరు పేర్ల బాధితుల పాదయాత్ర ఈరోజు రామగుండం మున్సిపల్ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆర్ జీ 1.జీ యం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి ఈ సమస్యలపై ఎస్ఓటు జీ ఎం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి,బమ్స్ నాయకులు యాదగిరి సత్తయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, మారుపేరుల సంఘం బాధ్యులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni

You cannot copy content of this page