TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్లో 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని తేల్చి చెప్పింది.

EHS కింద కూడా వైద్య సేవలు అందించలేమని పేర్కొంది.

పెండింగ్ బకాయిలతో పాటు తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగిస్తామంది.