WhatsApp Image 2024 03 27 at 5.55.35 PM
పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ఐతే ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీరు నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
