
AP Election Commission : త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిన విషయమేమిటంటే — ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల తేదీలు, షెడ్యూల్లను కల్పిస్తూ,అధికారిక లోగోలు, చిహ్నాలను అనధికారికంగా ఉపయోగిస్తూ,వాట్సాప్ ద్వారా తప్పుడు, ప్రచార రూపంలో ఉన్న సమాచారం విస్తృతంగా ప్రసారం అవుతున్నది. దీంతో సదరు సమాచారంవాస్తవికతపై స్పష్టత కోరుతూ ఎన్నికల సంఘం కార్యాలయానికి వివిధ వర్గాల నుండి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
సదరు సమాచారం పూర్తిగా నకిలీది, అనధికారికమైనది, అసత్యమైనది అని ఎన్నికల సంఘం స్పష్టంగాతెలియజేస్తున్నది. ఇటువంటి ధృవీకరించబడని సమాచారాన్ని నమ్మవద్దని,ప్రసారం చేయవద్దని,పంచుకోవద్దని ప్రజలను కోరుతున్నాము.ఉద్దేశపూర్వకంగా తప్పుడు లేదా ప్రచార కలిగించే సమాచారాన్ని సృష్టించడం,ప్రచారం చేయడం లేదా వ్యాప్తి చేయడం వంటి వారిపై అమలులో ఉన్న సైబర్ చట్టాలు, నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా నిజమైన, అధికారిక సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా అధికారిక పత్రికా ప్రకటన లేదా పత్రికా సమావేశం ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయబడుతుంది.అనధికారిక మూలాల నుండి లేదా సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడే ఎటువంటిసమాచారాన్ని అధికారికమైనదిగా భావించరాదు. ధృవీకరించబడిన అధికారిక ప్రకటనలపై మాత్రమేఆధారపడాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నాము.
అందువల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని, తదుపరి ఎలాంటి సమాచారం కోసం అధికారిక పత్రికా ప్రకటన/సమావేశం కోసం వేచి ఉండాలని ప్రజలు, మీడియా ప్రతినిధులు కోరబడుతున్నారు.
అనిల్ చంద్ర పునేత IAS (పదవీవిరమణ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe