అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

TRINETHRAM NEWS

రామగిరి మండలం ముస్త్యా ల గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా,

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మరియు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ముస్తాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులు అందాయి. ఈ హక్కులను మరియు రిజర్వేషన్లను కాపాడటం మనందరి బాధ్యత.

అందరికి సమాన అవకాశాలు అందుబాటులో ఉండేలా పనిచేయడం ద్వారా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఈకార్యక్రమంలో సుంధిల్ల శంకర్ రాము శంకర్ వెంకటస్వామి లింగయ్య పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top