జూలై 26, 2026
TRINETHRAM NEWS
Accused in Double Murder Case Dies

Accused Dies : త్రినేత్రం న్యూస్ : Jun 12, 2026, తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫాంహౌస్‌ వద్ద జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ ఆస్పత్రిలో మృతి చెందింది. అప్పు తీర్చాలని ఒత్తిడి తెచ్చిన ఇద్దరు మహిళలను హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో ఆమె నిందితురాలు.

విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినప్పుడు, కరీమాబీ బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ను సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 24 రోజుల చికిత్స అనంతరం బుధవారం రాత్రి ఆమె మరణించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను వికారాబాద్‌ ఎస్పీ సస్పెండ్‌ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page