WhatsApp Image 2024 04 09 at 11.57.39
Trinethram News : ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్ జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం.
అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు.
బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషం.
2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్ పట్టాభిషిక్తులయ్యారు.
