పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS

A spirited gathering of alumni

24 ఏళ్లకు కలిసిన విద్యార్థుల అనుభూతికి హద్దులు లేవు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని విద్యానగర్లోని శ్రీరామ విద్యాలయంలో 1999 – 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ముందుగా శ్రీరామ విద్యాలయం వ్యవస్థాపకులు, ప్రధానోపాధ్యాయులు పిట్టల రాజేందర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. టీచర్లు పద్మావతి, భాగ్య లక్ష్మి, ఉమాదేవి, జయశ్రీ, జ్యోతి, బి సరోజలను ఆత్మీయంగా సన్మానించారు. అలాగే సిబ్బంది సాయిలు, యాదగిరి లను సన్మానించారు. అనంతరం ఒకచోట చేరిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు జీవితంలో నేర్చుకున్న విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని చిన్ననాడు చేసిన అల్లరి, మరోసారి కేరింతలతో మారుమ్రోగించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుత జీవన శైలిని వివరాలు అనుభూతులను పంచుకున్నారు వివిధ చోట్ల ఉన్న ఈ రోజు ఒక చోట కలవడం ఆనందంగా ఉందని పలువురు పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A spirited gathering of alumni

You cannot copy content of this page

Scroll to Top