ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది

TRINETHRAM NEWS

Trinethram News 5th Jan 2024

ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం మురుకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…

ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని రాబోయే రోజులో వైసీపీ ప్రభుత్వం పతనము అవుతుందని అన్నారు

వైసీపీ ప్రభుత్వం లో మురుకుండపాడు గ్రామము నందు ఒక్క అభివృద్ధి పనులు కూడా చేప్పట్టలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వములో రోడ్లు వేసి అభివృద్ధి చేశామన్నారు

గత కొన్ని రోజుల క్రితం గ్రామములో విష జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వైసిపి ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకోలేదన్నారు

ప్రజల్లో మార్పు వచ్చిందని కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు తగిన గుణపాఠం చెపుతారన్నారు

మీ అందరికి తను అండగా ఉంటానని మురుకుండపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసే భాద్యత తనదని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top