Nayakpodu Sangam : ఆదివాసీ హక్కుల కోసం భారీ ర్యాలీ నిర్వహించనున్న

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట మండలంలో ఆదివాసి హక్కుల కోసం ఈనెల 21వ తారీకు ఆదివారం అశ్వారావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం తెలిపింది. ఈ ర్యాలీలో నాయక పోడు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సోమాని శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాళ్ల దుర్గయ్య పిలుపునిచ్చారు. ఈ మహోద్యమంలో ఆదివాసి ఇతర తెగలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. మన హక్కుల కోసం మనము అందరము కలిసి పోరాడాలని పోరాడితే పోయేదేమీ లేదని ఇది మన అందరి బాధ్యత అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A huge rally

You cannot copy content of this page

Scroll to Top