TRINETHRAM NEWS

తెలంగాణలో 15నెలల చిన్నారికి కరోనా

తెలంగాణ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 6 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 15నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు.

నాంపల్లి కి చెందిన చిన్నారికి జ్వరం, న్యుమోనియాతో బాధపడుతుండగా ఈ నెల 12వ తేదీన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తాజాగా చిన్నారికి కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ అని నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని నిలోఫర్ వైద్యులు తెలియజేశారు.