
NEET Retest : త్రినేత్రం న్యూస్ : ఈఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 2026 ప్రశ్నాపత్రం లీక్ కావడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి పరీక్షలో కొన్ని మార్పులు చేస్తోంది. వీటిని ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాబట్టి ఈసారి నీట్ పరీక్ష రాసే అభ్యర్ధులు వీటిని గమనించాల్సి ఉంటుంది.
నీట్ పరీక్షను పారదర్శకంగా, సురక్షితంగా, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రయత్నంలో భాగంగా జూన్ 21న జరగనున్న NEET (UG) 2026 పరీక్ష కోసం అభ్యర్థులకు అనుకూలమైన కొన్ని మార్పులు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. గత కొన్నేళ్లుగా అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పొడిగించారు. దీంతో మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
అలాగే హాజరు పత్రాలపై సంతకాలు చేయడం, ఇతర పర్యవేక్షణ (invigilation) ప్రక్రియల వంటి తప్పనిసరి పరీక్షా లాంఛనాలకు అవసరమైన సమయం కూడా ఇందులో కలిసి ఉంటుంది. పరిపాలనాపరమైన ప్రక్రియల వల్ల పరీక్ష రాసే అవకాశం తగ్గుతుందనే భావన లేకుండా, అభ్యర్థులు కేటాయించిన పరీక్ష సమయాన్ని పూర్తిగా వినియోగించుకునేలా ఈ సవరించిన సమయ విధానాన్ని రూపొందించారు. అదనంగా ప్రశ్నపత్రం బుక్లెట్లో ‘రఫ్ వర్క్’ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా పెంచుతున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe