
Adapala Vimalamma : డిండి, (గుండ్ల పల్లి )జూన్ 1 , త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండలంలోని బొల్లనపల్లి గ్రామ బి ఆర్ ఎస్ మహిళా నాయకురాలు అడపాల విమలమ్మ మృతి బాధాకరమని దేవరకొండ బి ఆర్ఎస్ నాయకులు వర్త్య రమేష్ నాయక్ అన్నారు.సోమవారం బోలనపల్లిలో ఆమె స్వగృహంలో మృతదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని అన్నారు .రమేష్ నాయక్ వెంట బి ఆర్ఎస్ నాయకులు రాఘవాచారి, భాస్కర్ ,ఉడత అంజయ్య, రాజేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, బచ్చిరెడ్డి, ఉడత సైదులు, వెంకటయ్య ,సిద్దయ్య, నరసింహ, అమరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి ,పార్వతమ్మ, యాదయ్య, సైదులు, సైదమ్మ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
