చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

TRINETHRAM NEWS

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు.

ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో క్యాంపును ఏర్పాటు చేశాయి.

ఇది స్థానికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. శిబిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, జొనాగూడ- అలిగూడ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా, జిల్లా రిజర్వ్ గ్రూపులు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ల సిబ్బందితో కూడిన బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు..

మావోయిస్టులు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా..14 మంది గాయపడ్డారు.అనంతరం భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు.

గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించారు.

You cannot copy content of this page

Scroll to Top