TRINETHRAM NEWS

Trinethram News : శ్రీకాకుళం

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009-14 వరకు సర్పంచిగా పనిచేశారు.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో విశాఖపట్నంలో న్యాయవాదిగా పని చేశారు. న్యాయ మూర్తి ఎంపిక పరీక్ష రాసి విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు.